తిన్నది చాలు.. ఇక లేస్తారా..?
Friday, November 11, 2011, 11:56 [IST]
A Gastric Pacemaker That Cuts Obesity
టీవీ చూస్తూ భోంచేస్తుంటే ఎంత తిన్నామో చూసుకోకుండా కుంభాలకు కుంభాలు లాగించేసే అలవాటు కొందరికి ఉంటుంది. ఇక పార్టీలు పెట్టుకున్నప్పుడు కబుర్లలో పడి, లేదా బలవంతంమీద 'మరి కాస్త' తీసుకుంటుంటారు. అలాంటివాళ్లను 'తిన్నది చాలు, కడుపు నిండింది.. ఆపెయ్' అని హెచ్చరించే సరికొత్త పరికరం వచ్చేసింది. అదే.. 'గ్యాస్ట్రిక్ పేస్‌మేకర్'. క్రెడి ట్‌కార్డు పరిమాణంలో ఉండే దీనికి 'ఎబిలిటీ' అని ముద్దుపేరు పెట్టారు. దీన్ని కీహోల్ శస్త్రచికిత్స ద్వారా పొట్టలో అమరుస్తారు. తగిన పరిమాణంలో ఆహారం తీసుకోగానే ఇది మెదడుకు సంకేతాలు పంపుతుంది.

ఈ పరికరాన్ని అమెరికన్ సంస్థ ఇంట్రాపేస్ తయారుచేసింది. దీనికి ఒక ఫుడ్ సెన్సార్, ఒక ఎలక్ట్రోడ్ ఉంటాయి. తిన్నది సరిపోయింది అనుకోగానే సెన్సార్ ట్రిప్ అయ్యి పరికరానికి సంకేతం పంపుతుంది. అది చిన్నస్థాయి విద్యుత్ పల్స్‌లను ఎలక్ట్రోడ్‌కు పంపుతుంది. అది సమీపంలో ఉండే వాగస్ నరాన్ని ఉత్తేజితం చేసి హార్మోన్ మార్పులకు కారణమవుతుంది. అప్పుడు మెదడుకు ఇక కడుపు నిండిందన్న సంకేతాలు వెళ్తాయి. ప్రయోగాత్మ కంగా కొందరికి దీన్ని అమర్చగా వారు సాధారణం కన్నా 45 శాతం తక్కువ తిన్నారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దీన్ని ఆపేసే సౌలభ్యం కూడా ఉంది.
Also read
» ‘చెవి’శుభ్రత పాటిస్తున్నారా..?
»  జాగ్రత్త!! సొరకాయ రసం ప్రాణాలు తీస్తుంది...?
» అందరి చూపు యోగా వైపే!!
» పెరుగులో అందాన్ని పెంచే శక్తి ఉందా..?