
''చాలా సినిమాల్లో చూస్తుంటాం.. హిరో, విలన్ లేదా హిరోయిన్లకు స్నానానికి ముందు ఒంటికి వివిధ తైలాలతో మర్దనా పట్టించి వ్యాయమం చేసిన అనంతరం సున్ని పండితో నలుగుపెట్టించుకుని మరి స్నానం చేస్తుంటారు.''
నిజ జీవితంలో స్నానానికి ముందు మసాజ్ ప్రక్రియ ఆరోగ్యదాయకమేనా అన్న సందేహాలు పలువురిలో ఉత్పన్నమువుతున్నాయి. ఈ అంశం పై నెలకున్న సందేహాలను నివృత్తి చేస్తూ నిపుణులు చేసిన సూచనలు విందామా...
- స్నానానికి ముందు శరీరమంతా నువ్వులనూనెతో మర్దనం చేయటం వల్ల చర్మం పగలటం, ఎండిపోవటం, దుర్వాసన వ్యాపించటం, చెమట పట్టటం వంటి సమస్యలను నియంత్రించవచ్చు.
- అయితే మర్దనం అనంతరం శారీరక బలాన్ని బట్టి వ్యాయమం చేస్తే శరీరం మరింత ధృడత్వాన్ని సంతరించుకుంటుంది.
- మసాజ్ అనంతరం వ్యాయమ చర్య వల్ల తైలం రోమకూపాల ద్వారా శరీర భాగాలకు ఇతర నరాలకు వ్యాప్తి శరీరాన్ని మరింత కాంతి వంతం చేస్తుంది.
- స్నానానికి ముందు శరీరానికి సున్ని పిండితో నలుగు పెట్టుకుంటే ముసలితనం దరికి రాదు.
Also read
» కంటి రంగును మార్చుకోవచ్చా..?» ‘నిద్ర’ నేర్చుకోండిలా..?
» షాంపూను నేరుగా తలకు పట్టిస్తున్నారా..?
» మగవారు ‘సెక్స్’ ఎంత సేపు చేయగలరు..?
